ముగించు

ధరణి

తేది : 29/10/2020 - | రంగం: ప్రభుత్వ
Dharani

ధరణి సమీకృత భూమి రికార్డులు తెలంగాణ రాష్ట్రములో ఉన్న వ్యవసాయ , వ్యవసాయేతర ప్రజల ఆస్తుల నమోదు ఉండే అధికారిక పోర్టల్ . ధరణి మొట్ట మొదటి సారిగా దేశములో ప్రప్రథమముగా తెలంగాణ ప్రభుత్వం ( భూ పరిపాలన శాఖ ) ఆరంభించింది . దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వం లో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు , ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం, సురక్షితమైన, ఇబ్బంది లేని ప్రజలకు సేవలను అందించడం ఈ పోర్టల్ లక్ష్యం. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లొసుగులను తొలగించడం, భూమి, ఆస్తి సంబంధిత సమాచారాన్ని అంతర్జాలం (ఆన్‌లైన్) లో ‌ నిల్వ చేయడం, వ్యవసాయ భూముల నమోదు, వారసత్వం విభజనను సరళీకృతం చేయడానికి, మొత్తం రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొద్ది నిమిషాల్లోనే పూర్తయ్యేలా చూడటానికి , ప్రజలకు ఇ-పట్టదార్ పాస్‌బుక్‌ను భూ యజమానులకు వెంటనే అందించడం దీని ప్రత్యేకత, ఈ అధికారిక పత్రములు కొద్ది నిముషములలోనే ప్రజలు పొందవచ్చును. కొత్త వ్యవస్థ విధాన ప్రకారం, వ్యవసాయ ఆస్తుల( భూములు) నమోదు కోసం తహసీల్దార్ ఉమ్మడి సబ్ రిజిస్ట్రార్లుగా,సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర ఆస్తుల ( ఇళ్ళు , స్థలములు ) వంటివి రిజిస్ట్రేషన్లను చేస్తారు 

ధరణి పోర్టల్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయములో 29-10-2020 నాడు ప్రారంభించారు. ధరణి పోర్టల్ లో ప్రజలకు సంభందించిన వ్యవసాయ ఆస్తులు దాదాపుగా 1,45,58,000 ఎకరాల భూముల వివరములు ఇందులో ఉన్నాయి. దీనిలో ఉన్న ప్రత్యేకత కొనుగోలు దారుడు తన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను 20 నిముషములలో పూర్తి చేసుకొని , ఇ-పాసుబుక్కు ( యజమాని హక్కుకు సంభందించిన ధ్రువపత్రము ) పొందవచ్చును.సింగల్ విండో ( ఏక గవాక్ష ) విధానములో తనకు కావలిసిన సేవలను భూ యజమాని ధరణి పోర్టల్ ద్వారా పొంద వచ్చును. అవినీతి నిర్ములనలో, పారదర్శకతను , జవాబు దారి విధానం గా భూపరిపాలన వ్యవస్థ( రెవెన్యూ పరిపాలనా వ్యవస్థ ) లో ధరణి పోర్టల్ ఒక విప్లవాత్మిక ఘట్టం.

 

లబ్ధిదారులు:

తెలంగాణ నివాసితులు

ప్రయోజనాలు:

పౌరులకు ఖచ్చితమైన మరియు పారదర్శక సేవలను నిర్ధారిస్తుంది.

ఏ విధంగా దరకాస్తు చేయాలి

మరింత సమాచారం కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి https://dharani.telangana.gov.in/